Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
బలగం సినిమాలో క్లైమాక్స్ సాంగ్ తో అందరినీ ఏడిపించిన బుడగజంగాల కళాకారులు పస్తం మొగిలయ్య తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ తరుణంలో మొగిలయ్య ఆరోగ్యంపై రాష్ట్ర మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు.
ఆయనకు మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు. మొగిలయ్యను వరంగల్ నుంచి హైదరాబాద్కు తరలించాలని సంబంధిత అధికారులను మంత్రులు ఆదేశించారు. గత కొద్ది రోజుల నుంచి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మొగిలయ్య వరంగల్లోని సంరక్ష ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు.