Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
పెద్దపల్లి జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు సబ్ రిజిస్ట్రార్ నిర్మల. డాక్యుమెంట్ల కోసం పూదరి శ్రీనివాస్ నుండి 60 వేల రూపాయలు తీసుకుంటుండగా పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్ దేవనగిరి నిర్మల, అటెండర్ శ్రీనివాసులను ఏసీబీ డీఎస్పీ భద్ర ఆధ్వర్యంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. గతంలో కూడా డాక్యుమెంట్ల కోసం డబ్బు తీసుకుని మరోసారి డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించగా ఇవాళ వారిని పట్టుకున్నారు.