Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పువ్వాడ నాగేశ్వర్ రావును రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ మంగళవారం పరామర్శించారు. కేటీఆర్ వెంట నాగేశ్వర్ రావు కుమారుడు, మంత్రి పువ్వాడ అజయ్ ఉన్నారు. కేటీఆర్ను చూసిన వెంటనే నాగేశ్వర్ రావు భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పువ్వాడకు అందిస్తున్న చికిత్స వివరాలను మంత్రి కేటీఆర్కు వైద్యులు క్షుణ్ణంగా వివరించారు. నాగేశ్వర్ రావు త్వరగా కోలుకోవాలని కేటీఆర్ ఆకాంక్షించారు.