Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మయన్మార్
మయన్మార్లో సైన్యం అరాచకాలకు అంతూపొంతు లేకుండా పోతోంది. సైనిక పాలనను వ్యతిరేకించే ఓ వర్గం నిర్వహించిన కార్యక్రమంపై వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ ఘటనలో 100 మంది వరకు మరణించినట్టు తెలుస్తోంది. వీరిలో పలువురు చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేసి ఫిబ్రవరి 2021లో సైన్యం అధికారాన్ని చేజిక్కించుకుంది. అప్పటి నుంచి తమను వ్యతిరేకించే వారిని సైన్యం ఉక్కుపాదంతో అణచివేస్తోంది. బలగాల దాడిలో ఇప్పటి వరకు దాదాపు 3 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మాండలేకు 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న పజిగ్గీ గ్రామంలో సైనిక పాలనను వ్యతిరేకించే ప్రతిపక్షం నిన్న స్థానిక కార్యాలయ ఏర్పాటు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి 150 మంది హాజయ్యారు. విషయం తెలిసిన సైన్యం ఆ కార్యక్రమంపై వైమానిక దాడికి దిగింది. ఈ ఘటనలో 100 మంది మరణించినట్టు ప్రజాస్వామ్య అనుకూల గ్రూప్, స్వతంత్ర మీడియా తెలిపాయి.