Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
భారత ప్రభుత్వ సంస్థ భారత హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (భెల్) వందేభారత్ రైళ్ల సరఫరా ఆర్డర్ను చేజిక్కించుకుంది. ఒక్కో రైలుకు రూ. 120 కోట్ల చొప్పున మొత్తం రూ.9600 కోట్ల ఆర్డర్ను సొంతం చేసుకుంది. ఈ కన్షార్షియంలో భాగస్వామిగా ఉన్న టిటాగఢ్ వ్యాగన్స్తో కలిసి భెల్ ఈ రైళ్లను తయారు చేయనుంది. 35 ఏళ్ల కాలానికి వార్షిక నిర్వహణ కాంట్రాక్ట్ (ఏఎంసీ) కూడా ఇందులో ఉన్నట్టు భెల్ తెలిపింది. కండిషన్స్ అగ్రిమెంట్ ప్రకారం 80 స్లీపర్ క్లాస్ వందేభారత్ రైళ్లను 72 నెలల్లో అంటే ఆరేళ్లలో సరఫరా చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 35 ఏళ్లపాటు వాటి నిర్వహణ బాధ్యతలు కూడా చూడాల్సి ఉంటుంది.
ప్రస్తుతం నడుస్తున్న వందేభారత్ రైళ్లలో చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్లు మాత్రమే ఉన్నాయి. దీంతో స్లీపర్ క్లాస్ రైళ్లు నడపాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఆర్డర్లు పిలవగా భెల్ దానిని దక్కించుకుంది. ప్రస్తుతం వందే భారత్ రైళ్ల ప్రయాణం పగటి పూటే సాగుతుండగా, స్లీపర్ క్లాస్ కోచ్లు అందుబాటులోకి వస్తే రాత్రిళ్లు కూడా నడిపే వీలుంటుంది.