Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి: యువగళం పేరిట నారా లోకేశ్ నిర్వహిస్తున్న పాదయాత్ర బుధవారం నాటికి 68వ రోజుకు చేరింది. ప్రస్తుతం ఆయన పాదయాత్ర అనంతపురం జిల్లాలో కొనసాగుతుండగా జిల్లాలోని రాయలచెరువులో బుధవారం జరిగే బహిరంగసభలో లోకేష్ పాల్గొని ప్రసంగించనున్నారు. కాగా.. లోకేష్ పాదయాత్ర, బహిరంగసభను విజయవంతం చేసేందుకు తెలుగుదేశం పార్టీ వర్గాలు అన్ని ఏర్పాట్లు చేశాయి.