Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ: పదవీ విరమణకు ఒక్కరోజు వ్యవధి ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులు వార్షిక ఇంక్రిమెంటుకు అర్హులేనని, అటువంటి ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చునని సుప్రీంకోర్టు తెలిపింది. కర్ణాటక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర విద్యుత్తు సంస్థ కేపీటీసీఎల్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ సి.టి.రవికుమార్ ధర్మాసనం మంగళవారం ఈ తీర్పు వెలువరించింది. మరుసటి రోజు పదవీ విరమణ చెందే ఉద్యోగి కూడా వార్షిక ఇంక్రిమెంటుకు అర్హుడేనని కర్ణాటక హైకోర్టు అంతకుముందు తీర్పునిచ్చింది. ఒక్కసారి ప్రభుత్వ సర్వీసు నుంచి తప్పుకున్న తర్వాత అటువంటి ప్రోత్సాహకాలేవీ వర్తించవని పేర్కొంది.