Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల సమీపంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ కళాశాల నూతన భవన సముదాయాలను మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం భవన సముదాయాలను పరిశీలించారు. మంత్రుల వెంట అతిథులుగా శాసనసభా సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేశ్బాబు, రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు, కలెక్టర్ అనురాగ్ జయంతి హాజరయ్యారు.