Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - శ్రీనగర్ : జమ్మూకశ్మీరులో బుధవారం ఉదయం 10.10 గంటలకు భూకంపం సంభవించింది. జమ్మూకశ్మీరును వణికించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైందని నేషనల్ సీస్మాలజీ శాస్త్రవేత్తలు చెప్పారు. 10 కిలోమీటర్ల లోతులో సంభవించిన భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని జమ్మూకశ్మీర్ అధికారులు చెప్పారు. బుధవారం ఉదయం పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని సిలిగురి, బీహార్ రాష్ట్రంలోని పూర్ణియా వద్ద భూమి కంపించింది.
ఒకే రోజు దేశంలో మూడు ప్రాంతాల్లో భూకంపం రావడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. దేశంలోని బీహార్, సిలిగురిలలో బుధవారం భూకంపం సంభవించింది.బీహార్ రాష్ట్రంలోని అరారియా సమీపంలోని పూర్ణియా వద్ద బుధవారం ఉదయం 5.35 గంటలకు భూకంపం సంభవించింది.ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. ఈ వరుస భూకంపాలతో జనం రోడ్లపైకి పరుగులు తీశారు.