Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: విశాఖ స్టీల్ప్లాంట్ వెనుక కుట్ర జరుగుతోందని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ ఆరోపించారు. ఛత్తీస్గఢ్లోని బైలదిల్లా గనులను కేంద్ర ప్రభుత్వం అదానీ పరం చేస్తోందని ఆయన ఆరోపించారు. హైదరాబాద్లోని భారాస శాసన సభాపక్ష కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పువ్వాడ మాట్లాడారు. ‘‘విశాఖ స్టీల్ప్లాంట్కు క్యాప్టివ్ గనులు లేకుండా చేసి దాన్ని మూసివేసేందుకు యత్నిస్తున్నారు. బైలదిల్లా నుంచి ఐరన్ ఓర్ను ముంద్రాకు తరలించేందుకు కుట్ర చేస్తున్నారు. ఆ గనులను బయ్యారానికి కేటాయించకుండా గుజరాత్కు తరలిస్తున్నారు. అదానీ కోసమే బైలదిల్లా నుంచి 1800కి.మీ.దూరంలోని ముంద్రాకు తరలిస్తున్నారు. బయ్యారంలో ఎప్పటికీ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు జరగకుండా కుట్ర జరుగుతోంది. అక్కడ స్టీల్ప్లాంట్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం ముందుకొస్తే మౌలిక వసతుల్లో 50 శాతం ఖర్చు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’ అని పువ్వాడ అజయ్ చెప్పారు.