Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఏపీలోని ఏలూరు జిల్లాలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న కారులో షార్ట్ సర్క్యూట్ సంబవించి కారు దగ్ధమయ్యింది. విజయవాడ నుంచి రాజమహేంద్రవరానికి ఆరుగురు ప్రయాణికులు కారులో బయలు దేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు ఏలూరు జిల్లా పెదపాడు మండలం అప్పనవీడు వద్ద పొగలు వ్యాపించడంతో అప్రమత్తమైన డ్రైవర్, ప్రయాణికులు కారులో నుంచి బయటకు వచ్చి ప్రాణాలను కాపాడుకున్నారు. కొద్ది నిమిషాల వ్యవధిలోనే కారు మొత్తం దగ్ధమైంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.