Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ మల్లాపూర్ పారిశ్రామిక వాడలో బుధవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రోడ్ నంబర్ 15లో ఉన్న పెయింట్ కంపెనీలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. పెయింటింగ్ రసాయనాలతో మంటలు, ఘాటైన వాసనలతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మంటలను ఆర్పేందుకు మౌలాలి, నాచారం, చర్లపల్లి అగ్నిమాపక సిబ్బంది సుమారు 5 శకటాలతో ప్రయత్నించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలో కార్మికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.