Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భిక్కనూర్
మండలంలోని జంగపల్లిలో ఈ నెల 3న జరిగిన బాబు మృతి కేసును పోలీసులు చేధించారు. జంగపల్లికి చెందిన బాబు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతని భార్య లవణ్య ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు లావణ్యకు స్వామి అనే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని గుర్తించారు. భర్తను అడ్డు తొలగించాలనే ఉద్దేశ్యంతో ఆమె, ఆమె ప్రియుడు స్వామితో కలిసి వైర్తో హత్య చేసినట్లు సీఐ తిరుపయ్య తెలిపారు. నిందితులను బుధవారం విలేకరుల ముందు ప్రవేశపెట్టి రిమాండ్ కు తరలించారు. కేసును ఛేదించిన ఎస్సై ఆనంద్ గౌడ్ ను, కానిస్టేబుల్ వెంకటరాములు, రేణుక ని సీఐ అభినందించారు.