Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బెంగళూరు: ఇంటి ముందు కుక్క మల విసర్జన చేయడంపై ఆ ఇంటి యజమాని అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో జరిగిన గొడవలో పొరుగింటికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆ వృద్ధుడ్ని కొట్టి చంపారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. సోలదేవనహళ్లి పోలీస్స్టేషన్ పరిధిలోని గణపతి నగర్లో నివాసముంటున్న ప్రమోద్ ప్రతి రోజూ తన పెంపుడు కుక్కను బయటకు తీసుకెళ్లేవాడు. పొరుగున ఉంటే మునిరాజు ఇంటి ముందు ఆ కుక్క మల విసర్జన చేసేది. ప్రమోద్ కూడా అక్కడే నిల్చొని సిగరెట్ తాగేవాడు. దీనిపై వారిద్దరి మధ్య తరచుగా వాగ్వాదం జరుగుతున్నది. కాగా, ఈ నెల 8న ప్రమోద్ యథావిధిగా మునిరాజు ఇంటి ముందు కుక్కతో మల విసర్జన చేయించాడు. దీంతో మునిరాజు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేయగా ఆ రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ప్రమోద్ తన స్నేహితుడితో కలిసి క్రికెట్ బ్యాట్తో మునిరాజ్ను కొట్టాడు. ఆ దెబ్బలు తాళలేని ఆ వృద్ధుడు చనిపోయాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమోద్తోపాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.