Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - పెదపాడు: ఏలూరు జిల్లా పెదపాడు మండలం అప్పనవీడు వద్ద జాతీయ రహదారిపై కారు మంటల్లో చిక్కుకున్న ఘటన బుధవారం చోటు చేసుకుంది. విజయవాడ వైపు నుంచి గౌరీపట్నం వెళుతున్న స్విప్ట్ కారు అప్పనవీడు సమీపంలోకి వచ్చేసరికి రేడియేటర్లో నీరు పోసేందుకు కారును రోడ్డు పక్కన నిలిపారు. రేడియేటర్లో నీరు పోస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో కారులో వున్న నలుగురు ప్రయాణీకులు సురక్షితంగా బయటకు వచ్చేశారు. అనంతరం కారు మంటల్లో చిక్కుకుంది. ఘటనపై పెదపాడు పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు.