Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కడప
వైఎస్ఆర్ జిల్లాలోని పులివెందుల పట్టణ సీఐపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి విచారణకు ఆదేశించారు. పట్టభద్రుల ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూలంగా పనిచేసినట్లు టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి సీఈవోకు ఫిర్యాదు చేశారు. అయితే మార్చి 13న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలో వైసీపీ నాయకులు అనుమతి లేకుండా కౌంటింగ్ కేంద్రాల్లోకి వెళ్లారని సీఐ రాజు సహకారంతోనే వారు వెళ్లినట్లు భూమిరెడ్డి తన ఫిర్యాదులో తెలిపారు.ఈ తరుణంలో రామగోపాల్ రెడ్డి ఫిర్యాదుపై స్పందించిన సీఈవో ముఖేష్కుమార్ మీనా దీనిపై విచారణకు ఆదేశించారు. విచారించి నివేదిక అందించాలని రాష్ట్ర డీజీపీ, వైఎస్సార్ జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు.