Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - విశాఖపట్నం
వైజాగ్ స్టీల్ప్లాంట్పై కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్సింగ్ కులస్తే కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికిప్పుడు స్టీల్ప్లాంట్ను ప్రయివేటుపరం చేయాలని భావించడం లేదన్నారు. నగరంలోని పోర్టు కళావాణి స్టేడియంలో నిర్వహించిన రోజ్గార్ మేళాలో కేంద్రమంత్రి పాల్గొన్నారు.
ఈ తరుణంలో ఫగ్గన్సింగ్ కులస్తే మాట్లాడుతూ ఇప్పటికిప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రయివేటుపరం చేయాలని అనుకోవడం లేదు. దీనిపై ప్రస్తుతానికి ముందుకెళ్లడం లేదు. దానికంటే ముందు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ను బలోపేతం చేసే పనిలో ఉన్నాం. స్టీల్ ప్లాంట్లో కొన్ని కొత్త విభాగాలు ప్రారంభిస్తున్నాం. ముడిసరకు పెంపొందించే ప్రక్రియపై దృష్టి పెట్టాం. పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు ప్లాంట్ పనిచేసే ప్రక్రియ జరుగుతోంది. దీనిపై ఆర్ఐఎన్ఎల్ యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చిస్తాం. ఆర్ఐఎన్ఎల్ అధికారులతో భేటీ అవుతున్నాం అని తెలిపారు.