Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
కాంగ్రెస్కు మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ రాష్ట్ర ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గేకు పంపారు. రాష్ట్ర కాంగ్రెస్లో జరుగుతున్న పరిణామాలపై గతకొంతకాలంగా అసంతృప్తితో ఉన్న మహేశ్వర్రెడ్డి నేడు రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.
ఈ తరుణంలో కాంగ్రెస్కు రాజీనామా అనంతరం ఢిల్లీలో తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ఛుగ్తో మహేశ్వర్రెడ్డి భేటీ అయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఇతర నేతలతో వెళ్లి ఆయన్ను కలిశారు. కాసేపట్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఏలేటి మహేశ్వర్రెడ్డి సమావేశం కానున్నారు.