Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఆర్థిక మోసగాడు సుఖేశ్ చంద్రశేఖర్తో తనకెలాంటి పరిచయం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. నకిలీ చాట్లతో తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఒక ఆర్థిక నేరగాడు అనామక లేఖ రాస్తే రాద్ధాంతం చేస్తున్నారు. ఆ లేఖను పట్టుకుని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ సీఈసీకి లేఖ రాశారు. బీజేపీ టూల్కిట్లో భాగమే ఈ బురదచల్లే కార్యక్రమం. వాస్తవాలు తెలుసుకోకుండా పనిగట్టుకుని కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు ప్రచురించాయి. కేసీఆర్ను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేకనే తనపై ఇలా దాడికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.