Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్ గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్ ను ఆ రాష్ట్ర పోలీసులు ఎన్ కౌంటర్ చేసి హతమార్చారు. ఈ ఎన్ కౌంటర్ లో అసద్ అహ్మద్ అనుచరుడు, షూటర్ అయిన మరో వ్యక్తి కూడా హతమయ్యాడు. ఉమేశ్ పాల్ హత్య కేసులో అసద్ అహ్మద్ మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు. ఈ సందర్భంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎన్ కౌంటర్లు నిర్వహిస్తోందని మండిపడ్డారు. మతం పేరుతో ఎన్ కౌంటర్లు చేస్తున్నారని విమర్శించారు. బుల్లెట్లతో న్యాయం చేస్తామని నిర్ణయించినప్పుడు ఈ కోర్టులు దేనికని ప్రశ్నించారు. న్యాయస్థానాలను మూసి వేయండని అన్నారు.