Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-న్యూఢిల్లీ : ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ప్రెసిడెంట్ మౌలానా రబే హస్నీ నద్వీ గురువారం తుదిశ్వాస విడిచారు. వయోభారంతో గత కొంతకాలంగా నద్వీ (94) అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. న్యుమోనియా, శ్వాసకోశ సమస్యలు బాధించడంతో ఆయనను చికిత్స నిమిత్తం రాయ్బరేలి నుంచి లక్నోతరలించారు. దలీగంజ్లోని నద్వా మదర్సాలో నద్వీ మరణించారు. మౌలానా రబే హస్నీ నద్వీ ఏ అంశంలోనైనా సూటిగా కుండబద్దలు కొట్టినట్టు తన అభిప్రాయం వెల్లడించేవారు. మతపరమైన అంశాల్లో సమాజానికి మార్గదర్శనం చేసేవారు. ముస్లింలు ఇస్లాం మతాన్ని కేవలం నమాజ్కే పరిమితం చేశారని, సామాజిక విషయాలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఓ సందర్భంలో ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇస్లాం కేవలం ప్రార్థనకే పరిమితం కాకూడదని ఆకాంక్షించారు. కాగా, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ప్రెసిడెంట్ మౌలానా రబే హస్నీ నద్వీ మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.