Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : కుటుంబ కలహాలతో మహిళ మృతి చెందిన సంఘటన మాసాయిపేటలో గురువారం చోటు చేసుకుంది. చేగుంట పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కల్పన (21) కుటుంబ కలహాలతో బుధవారం మధ్యాహ్నం సమయంలో ఇంట్లో ఉన్న ఎలుకల మందును సేవించి ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం కల్పన మృతి చెందిది. మృతురాలికి ఏడాది వయస్సు గల కూతురు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కల్పన తండ్రి కిష్టయ్య ఫిర్యాదు మేరకు చేగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు తెలిపారు.