Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: ఖమ్మం జిల్లా చీమలపాడు అగ్నిప్రమాద బాధితులను మంత్రి కేటీఆర్ పరామర్శించారు. నిమ్స్కు వెళ్లిన మంత్రి వైద్యులతో మాట్లాడి బాధితుల ఆరోగ్యంపై అడిగి తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్న నలుగురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు కేటీఆర్కి వైద్యులు తెలిపారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని మంత్రి వారికి సూచించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ చీమలపాడులో జరిగిన సంఘటన దురదృష్టకరమన్నారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన ముగ్గురి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున.. క్షతగాత్రులకు రూ.2లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాను సీఎం కేసీఆర్ ప్రకటించినట్టు చెప్పారు. గాయపడిన బీఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. ఈ అగ్నిప్రమాదంలో కుట్రకోణం ఉందా? లేదా? అనే విషయం పోలీసు దర్యాప్తులో తేలుతుందని కేటీఆర్ అన్నారు.