Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాన - సాగర్నగర్: విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీ వద్ద మరోసారి ఉద్రిక్తత నెలకొంది. వర్సిటీలో కొంత మేర ప్రభుత్వ స్థలంగా గుర్తించినట్లు తెలిపిన రెవెన్యూ అధికారులు.. కంచె నిర్మాణం చేపడుతున్నారు. పోలీసు బందోబస్తు మధ్య కంచె నిర్మాణ సామాగ్రితో వర్సిటీలోకి రెవెన్యూ సిబ్బంది వెళ్లారు. ప్రధాన క్యాంపస్లోని డెంటల్ కాలేజ్ వద్ద కిలోమీటర్ మేర కంచె వేస్తున్నారు. ఈ కారణంగా తెల్లవారుజామున 2 గంటల నుంచే గీతం వర్సిటీకి వెళ్లే అన్ని రోడ్లపై పోలీసులు ఆంక్షలు విధించారు. సుమారు రెండు కిలోమీటర్ల ముందుగానే బారికేడ్లను ఏర్పాటు చేసి ఎవరినీ వెళ్లనివ్వలేదు. ఐడీ కార్డులు చూపిస్తేనే స్థానికులను ఆ మార్గంలో పంపిస్తున్నారు. పోలీసుల ఆంక్షలతో చుట్టు పక్కల ప్రజలు, కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది జనవరిలోనూ గీతం కళాశాలను ఆనుకొని ఉన్న 14 ఎకరాల భూమిని ప్రభుత్వ అధికారులు స్వాధీనపరుచుకున్న విషయం తెలిసిందే.