Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తెలుగు సినీ ఇండస్ట్రీలో బహుముఖ ప్రజ్ఙాశాలికి పేరుపొందిన నటుడు పోసాని కృష్ణ మురళి. రచయితగా, నటుడిగా, దర్శకుడిగా చిత్రసీమలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పోసాని ఏపీ ప్రభుత్వ చలనచిత్ర టీవీ అభివృద్ధి సంస్థ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. కాగా తాజాగా పోసాని కృష్ణ మురళికి కరోనా సోకింది. దాంతో ఆయన్ను హైదరాబాద్లోని ఏఐజి ఆసుపత్రికి తరలించారు.
పూణేలో జరిగిన షూటింగ్లో పాల్గొని నిన్ననే హైదరాబాద్కు వచ్చిన పోసాని కృష్ణ మురళికు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కాగా పోసానికి కరోనా పాజిటివ్ రావడం ఇది మూడోసారి. కాగా..తెలంగాణలో క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న 45 కరోనా కేసులు నమోదు కాగా.. హైదరాబాద్లోనే 18 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సూచనలు చేసింది.