Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఎంపీ అవినాష్రెడ్డి ప్రధాన అనుచరుడు గజ్జల ఉదయ్కుమార్ రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకుంది. గూగుల్ టేక్అవుట్ ద్వారా భాస్కర్ రెడ్డి ఇంట్లో ఉదయ్ ఉన్నట్లు దర్యాప్తు సంస్థ గుర్తించింది. పులివెందుల నుంచి కడప కారాగారం అతిథిగృహానికి ఉదయ్ను తీసుకెళ్లి విచారణ జరుపుతోంది.
వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు అవినాష్, శివశంకర్ రెడ్డితో పాటు ఘటనాస్థలికి ఉదయ్ వెళ్లినట్లు.. ఆ రోజు అంబులెన్స్, ఫ్రీజర్, వైద్యులను రప్పించడంలో కీలక పాత్ర పోషించినట్లు సీబీఐ భావిస్తోంది. వివేకా మృతదేహానికి ఉదయ్ తండ్రి జయప్రకాశ్ రెడ్డి బ్యాండేజ్ కట్లు కట్టినట్లు అనుమానిస్తున్నారు. ఉదయ్ను గతంలో పలుమార్లు సీబీఐ అధికారులు విచారించారు.