Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కరీంనగర్: హుజూరాబాద్లో శుక్రవారం ఉదయం ప్రకాశ్ అంబేద్కర్ హుజూరాబాద్లో దళితబందు లబ్దిదారులను కలువనున్నారు. వారి అనుభవానలు, దళితబంధుతో వారి జీవితాల్లో వచ్చిన మార్పులను గురించి తెలుసుకోనున్నారు. ఇందులో భాగంగా ప్రకాశ్ అంబేద్కర్ కరీంనగర్ చేరుకున్నారు. ఆయనకు మంత్రి గంగుల కమలాకర్ సాదర స్వాగతం పలికారు. దళితబంధు జ్ఞాపికను అందజేశారు. మంత్రి గంగులతోపాటు విప్ బాల్క సుమన్ ఇతర ఉన్నతాధికారులతో కలసి ప్రకాశ్ అంబేద్కర్ హుజూరాబాద్ చేరుకుంటారు. అనంతరం ఆయన హైదరాబాద్కు చేరుకుంటారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు.