Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: ఏటా అంబేద్కర్ జయంతి జరుపుకుంటున్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అంబేద్కర్ విశ్వ మానవుడు అని సీఎం తెలిపారు. అంబేద్కర్ సిద్ధాంతం విశ్వజనీనం సార్వజనీనం అన్నారు. అంబేద్కర్ రాజ్యంగం అమల్లోకి వచ్చి 70 ఏళ్లు దాటిందన్నారు. ఎవరో అడిగితే అంబేద్కర్ విగ్రహం పెట్టలేదన్నారు. విశ్వమానవుడి విశ్వరూపం ప్రతిష్టించుకున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. సచివాలయానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టుకున్నామని తెలిపారు. ఇక్కడికి దగ్గరల్లోనే అమరవీరుల స్మారకం ఉంది. అంబేద్కర్ విగ్రహం సమీపంలోనే బుద్ధుడి విగ్రహం ఉందని తెలిపారు. అంబేడ్కర్ సిద్ధాంతాలు స్మరణకు వచ్చేలా ఏర్పాట్లు చేశామన్నారు. తెలంగాణ కలలు సాకారం చేసుకునే చిహ్నం ఈ విగ్రహం అని కేసీఆర్ అభివర్ణించారు. విగ్రహ ఏర్పాటుకు కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. అంబేద్కర్ పేరిట అవార్డు ఇవ్వాలని కత్తి పద్మారావు సూచించారని కేసీఆర్ గుర్తుచేశారు. అంబేద్కర్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం అవార్డు ఇవ్వబోతోందన్నారు. అవార్డు కోసం రూ. 51 కోట్ల నిధి ఏర్పాలు చేస్తున్నామని తెలిపారు. ఏటా అంబేద్కర్ జయంతి రోజున అవార్డు ప్రధానం చేస్తామని సీఎం పేర్కొన్నారు.