Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ అయ్యాయి. తూర్పు విదర్భ నుంచి ఉత్తర కోస్తా కర్ణాటక వరకు ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. ఈ తరుణంలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని యెల్లో అలెర్ట్ ద్వారా వాతావరణ శాఖ తెలిపింది. దీంతో సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ అయ్యాయ్యి. ద్రోణి ప్రభావంతో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం, వడగండ్ల వానకు సైతం ఆస్కారం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అంతే కాకుండా హైదరాబాద్లోనూ వర్ష ప్రభావం ఉండొచ్చనని సమాచారం.