Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో దళితబంధు యూనిట్లను రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్ శుక్రవారం పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హుజూరాబాద్లో దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. తొలి విడుతలోనే లబ్ధిదారులకు యూనిట్లు నెలకొల్పిన విషయం తెలిసిందే. హైదరాబాద్లో ప్రభుత్వం 125
అడుగుల విగ్రహాన్ని నిర్మించగా.. ఆవిష్కరణ కోసం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్ నుంచి హెలీకాప్టర్లో బయలుదేరి వెళ్లి హుజూరాబాద్, జమ్మికుంటలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితబంధు పథకం రాష్ట్రంలో సరికొత్త ప్రయోగం ఈ పథకం ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ పథకం ప్రవేశపెట్టక ముందు వీళ్లంతా మరొకరి వద్ద ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి ఉండేదని, ఈ పథకాలు పడ్బందీగా అమలు చేస్తే మరింత మందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. చదువుతో పాటు ఉపాధి కల్పించే పథకాలు అమలు చేస్తేనే దళితుల జీవన ప్రమాణాలు పెరుగుతాయని, బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటి కౌంటర్ గ్యారంటీ అడగడమే ఇబ్బందులను తెచ్చిపెడుతుందన్నారు.