Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - జపాన్
జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా త్రుటిలో తప్పిన పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వకయామాలో ఆయన ప్రసంగిస్తుండగా ఓ స్మోక్బాంబు భారీ శబ్దంతో పేలింది. వెంటనే అప్రమత్తమైన ప్రధాని భద్రతా సిబ్బంది ఆయనను సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు. వకయామా నగరంలో ఆయన ప్రసంగించడానికి ముందు దుండగులు పైప్ బాంబు విసిరారు. అది పెద్ద శబ్దంతో పేలడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. వకయామాలోని ఫిషింగ్ హార్బర్ను సందర్శించిన తర్వాత ఆయన ప్రసంగించడానికి ముందు ఈ ఘటన జరిగినట్టు స్థానిక మీడియా పేర్కొంది. ఈ క్రమంలో పేలుడు కారణంగా ప్రధాని కిషిడా ప్రసంగం రద్దయింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.