Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఢిల్లీ
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఉద్యోగ నియామక పరీక్షలను ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని ఇటీవల డిమాండ్లు వినిపించిన విషయం తెలిసిందే. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ విషయమై అమిత్ షాకు లేఖ సైతం రాశారు. ఈ తరుణంలో తాజా ప్రకటన వెలువడింది. ప్రాంతీయ భాషల వినియోగాన్ని, అభివృద్ధిని ప్రోత్సహించేందుకు కట్టుబడి ఉన్నట్లు కేంద్ర హోం శాఖ తెలిపింది.
ప్రస్తుతం ఉన్న హిందీ, ఇంగ్లిష్తోపాటు మరో 13 ప్రాంతీయ భాషల్లోనూ కేంద్ర సాయుధ పోలీసు బలగాల కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పరీక్ష నిర్వహణకు కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపింది. సీఏపీఎఫ్ల్లో స్థానిక యువత భాగస్వామ్యాన్ని పెంచడంతోపాటు ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేందుకుగానూ ఈ చారిత్రక నిర్ణయం తీసుకున్నట్లు హోంశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.