Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
ట్రాన్స్ జెండర్ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా ట్రాన్స్ జెండర్లకు మంచి వైద్యం, విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేయనుంది. వారికి సామాజిక భద్రత కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం పాలసీని అమలు చేయనుంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్ జెండర్లకు గుర్తింపు కార్డులను జారీ చేయనుంది. వారి కోసం ప్రస్తుత బడ్జెట్ లో రూ. 2 కోట్లు కేటాయించింది. ఇప్పటికే నవరత్నాల ద్వారా వీరికి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తోంది. దీంతో ప్రత్యేకంగా మరికొన్ని చర్యలు చేపట్టింది. వాళ్లు నివసించే ప్రాంతాల్లో మంచినీటి సరఫరా, పారిశుధ్య సదుపాయాలు కల్పిస్తోంది. వారికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది.