Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం కాచిగూడ నుంచి మదురైకు ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది. కాచిగూడ నుంచి ఈ నెల 17, 24, మే 1, 8, 15, 22, 29, జూన్ 5, 12, 19, 26 తేదీల్లో రాత్రి 8.50 గంటలకు బయల్దేరే ప్రత్యేక చార్జీ రైలు మరుసటిరోజు రాత్రి 8.45 గంటలకు మదురై చేరుకుంటుంది. అలాగే, మదురై నుంచి ఈ నెల 19, 26, మే 3, 10, 17, 24, 31, జూన్ 7, 14, 21, 28 తేదీల్లో తెల్లవారుజామున 5.30 గంటలకు బయల్దేరే రైలు మరుసటిరోజు ఉదయం 7.05 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఈ రైళ్లు కాట్పాడి, తిరువణ్ణామలై, విల్లుపురం, విరుదాచలం, తిరుచ్చి, దిండుగల్ మీదుగా వెళ్తాయని, ఈ రైళ్ల ముందస్తు రిజర్వేషన్ శుక్రవారం నుంచి ప్రారంభమైందని అధికారులు తెలిపారు.