Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడిగా అర్జున్ టెండూల్కర్ అందరికీ తెలిసినవాడే. కానీ క్రికెట్ మైదానంలో తనను నిరూపించుకోవడానికి, తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకోవడానికి అర్జున్ టెండూల్కర్ తీవ్రంగా కృషి చేస్తున్నాడు.ఇప్పుడు ఐపీఎల్ లోనూ అరంగేట్రం చేస్తున్నాడు. 2021 వేలంలో ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ అతడిని కనీస ధరకు కొనుగోలు చేసింది. ఇటీవల మినీ వేలంలోనూ అతడిని దక్కించుకుంది. ఈ క్రమంలో నేడు ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో ఆడే ముంబయి ఇండియన్స్ తుది జట్టులో అర్జున్ టెండూల్కర్ కు స్థానం లభించింది. అర్జున్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ చేతుల మీదుగా ఎంఐ క్యాప్ అందుకున్నాడు. ప్రధానంగా ఎడమచేతివాటం ఫాస్ట బౌలర్ అయిన అర్జున్ బ్యాటింగ్ లో భారీ షాట్లు కొట్టడంలో దిట్ట.