Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ - 2023 పరీక్ష వాయిదా వేయాలంటూ విద్యార్థుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. మే 7న 499 నగరాలు/పట్టణాల్లో ఈ పరీక్ష జరగనుండగా దాదాపు 21లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉంది. దేశంలో కరోనా కేసుల పెరుగుదల, బోర్డు పరీక్షలు ఇటీవలే పూర్తికావడంతో ప్రిపరేషన్కు తగిన సమయం లేకపోవడం వంటి కారణాలతో ఈ పరీక్షను నెల లేదా రెండు నెలల పాటు వాయిదా వేయాలంటూ విద్యార్థులు జాతీయ పరీక్షల మండలిను కోరుతున్నారు.
ఈ తరుణంలో పీఎంవో, ప్రధాని మోడీ, ఎన్టీఏ డీజీ, కేంద్ర విద్యా, వైద్యశాఖ మంత్రులు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఢీల్లీ సీఎం కేజ్రీవాల్, తమిళనాడు సీఎం స్టాలిన్ తదితరులను ట్యాగ్ చేస్తూ పరీక్ష వాయిదా వేయాలంటూ ట్వీట్లు చేస్తున్నారు. దేశంలో రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆందోళనకు గురవుతున్నామని ఈ పరీక్షను నెల రోజులు వాయిదా వేయాలంటూ మరికొందరు విజ్ఞప్తి చేస్తున్నారు.