Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : వివేకా హత్య కేసులో ఈ ఉదయం అరెస్ట్ చేసిన వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు హైదరాబాదులో జడ్జి ఎదుట హాజరుపర్చడం తెలిసిందే. భాస్కర్ రెడ్డికి సీబీఐ జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. భాస్కర్ రెడ్డి తరఫు న్యాయవాదులకు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులపై భాస్కర్ రెడ్డి న్యాయవాదులు రేపు కౌంటర్ దాఖలు చేయనున్నారు. జడ్జి నివాసంలో జరిగిన విచారణ సందర్భంగా, సీబీఐ రిమాండ్ రిపోర్ట్ సమర్పించింది. భాస్కర్ రెడ్డి పారిపోతాడని భావించి ముందే అరెస్ట్ చేశామని వెల్లడించింది. అతడు విచారణకు అందుబాటులో లేకుండా పోయే ప్రమాదముందని, కీలకసాక్షలను ప్రభావితం చేసే అవకాశం ఉండడంతో అరెస్ట్ చేయాల్సి వచ్చిందని వివరించింది . విచారణకు వైఎస్ భాస్కర్ రెడ్డి సహకరించడంలేదని, విచారణను తప్పుదోవ పట్టించేలా సమాధానాలు ఇచ్చారని సీబీఐ వెల్లడించింది.
వివేకాపై భాస్కర్ రెడ్డి కుటుంబం అసంతృప్తితో ఉందని, 2017లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి వివాదం ఉందని తెలిపింది. ఈ మేరకు భాస్కర్ రెడ్డి అరెస్ట్ కారణాలను సీబీఐ రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది.