Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తిరుమలలో ఆదివారం మధ్యాహ్నం స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. ఆస్థాన మండపంలో ఒక్క సారిగా మంటలు చెలరేగడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. నిరుపయోగంగా ఉన్న పరుపులు దగ్ధం కావడంతో ప్రమాదం జరిగిందని తితిదే అధికారులు తెలిపారు. ఆకతాయిలు నిప్పంటించడంతో ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు.