Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
కోడి కత్తి కేసు సోమవారం ఎన్ఐఏ కోర్టులో కీలక విచారణ జరగనుంది. నిందితుడు తరపున అబ్దుల్ సలీం, ఎన్ఐఏలు దాఖలు చేసిన కౌంటర్లపై ఈరోజు సీఎం జగన్ తరపు న్యాయవాది వాదనలు వినిపించనున్నారు. ఈ నెల 13న కౌంటర్ అధ్యయనానికి జగన్ తరపు న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వర్లు రెండు రోజుల సమయం కోరిన విషయం తెలిసిందే. దీంతో విచారణను ఎన్ఐఏ కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈరోజు వాదనలు వినిపించాలని అదేరోజు హియరింగ్ విని ఆర్డర్ ఇస్తానని న్యాయమూర్తి అన్నారు. వాయిదాలు ఇవ్వద్దంటూ గత వాయిదాలో నిందితుడు తరపు న్యాయవాది అభ్యర్థించారు. దీంతో న్యాయస్థానం కేసు విచారణను సోమవారానికి వాయిదా వేసింది.