Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- హైదరాబాద్: వనస్థలిపురంలో విషాదం చోటుచేసుకుంది. కీసర ఎంపీడీవో గుండెపోటుతో ప్రాణాలు వదిలారు. వనస్థలిపురంలో నివసిస్తు్న్న ఆమె ఆదివారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈతరుణంలో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆమెను మలక్ పేట యశోద ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె చనిపోయినట్లు ధ్రువీకరించారు. గతంలో మేడ్చల్ ఎంపీడీవోగా పనిచేసిన రమాదేవి ఆరు నెలల క్రితమే కీసర ఎంపీడీవోగా బదిలీ అయ్యారు. ఆమెకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆమె మృతితో కుటంబంలో విషాదం నెలకొంది.