Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- హైదరాబాద్
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సాయంత్రం 5 గంటల తర్వాత విచారణకు రావాలని ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి సీబీఐ తెలిపింది. తెలంగాణ హైకోర్టులో అవినాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో విచారణకు ఈరోజు మినహాయింపును ఇవ్వాలని సీబీఐను అవినాశ్ తరపు లాయర్లు కోరారు. అయితే వారి విన్నపాన్ని సీబీఐ తిరస్కరించింది. సాయంత్రం 5 తర్వాత విచారణకు రావాలని ఆవేశించింది. మరోవైపు, బెయిల్ పిటిషన్ పై వాదనలను మధ్యాహ్నం 3.45కి హైకోర్టు వాయిదా వేసింది. అంతకు ముందు బెయిల్ పిటిషన్ పై ఇరుపక్షాలు వాదనలు వినిపించాయి. మరోవైపు వివేకా కుమార్తె సునీత కూడా ఇంప్లీడ్ పిటిషన్ వేశారు.