Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హర్యానా
మూడంతస్తుల రైస్ మిల్లు కుప్పకూలిన దుర్ఘటనలో ఇద్దరు కార్మికులు మరణించగా, మరో 14 తీవ్రంగా గాయపడిన ఘటన హర్యానా రాష్ట్రంలో సోమవారం అర్దరాత్రి జరిగింది. కర్నాల్ నగరంలోని తరావూరి వద్ద ఉన్న మూడంతస్తుల శివశక్తి రైస్ మిల్లులో కార్మికులు నిద్రపోతుండగా సోమవారం రాత్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అగ్నిమాపక శాఖ అధికారులు, పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చి శిథిలాల కింద ఉన్న వారిని వెలికితీస్తున్నారు. రైస్ మిల్లు ప్రాంతంలో 100మందిని ఖాళీ చేయించారు. రైస్ మిల్లు యజమానిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.