Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - విశాఖ: ఉక్కు కర్మాగారంలో ప్రొడక్షన్, ప్లానింగ్ అండ్ మానటరింగ్ విభాగంలో డీజీఎంగా పనిచేస్తున్న అధికారి ఒకరు అనుమానాస్పదంగా మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్మాగారంలోని ఈడీ పీపీఎం విభాగం కార్యాలయంలో డీజీఎంగా పనిచేస్తున్న టి.వి.వి.ప్రసాద్ (50) జనరల్ షిఫ్ట్ విధులకు సోమవారం హాజరయ్యారు. కార్యాలయం మూడో అంతస్తులోని తన గదిలోకి వెళ్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ను అక్కడ ఉన్న సిబ్బంది ప్రథమ చికిత్స కేంద్రానికి, అక్కడ నుంచి స్టీల్ జనరల్ అస్పత్రకి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. లకి చేరుకున్నారు. ఈ ఘటనపై స్టీల్ప్లాంట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.