Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హర్యానా: కర్నాల్లోని తారావాడి ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో శివశక్తి రైస్మిల్ అనే భవనంలో కొంత భాగం కూలిపోయింది. మూడు అంతస్తుల రైస్ మిల్లు భవనంలో కొంత భాగం కూలిపోవడంతో నలుగురు మృతి చెందగా, 20 మంది గాయపడగా వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ భవనం శిథిలాల కింద 150 మందికి పైగా కూలీలు చిక్కుకున్నారు. వారిలో 100 మందిని సురక్షితంగా బయటకు తీశామని.. ఇంకా కొంత మంది చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. ఈ అంశంపై దర్యాప్తు చేసేందుకు హర్యానా రాష్ట్ర ప్రభుత్వం 2 బృందాలను నియమించినట్లు సమాచారం. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.