Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఐపీఎల్ మ్యాచుల కేంద్రంగా అక్రమంగా డబ్బుపోగు చేసుకుంటున్నారు. బెట్టింగ్లు నిర్వహిస్తూ డబ్బులను సంపాదించుకుంటున్నారు. ఈ తరుణంలో తాజాగా రంగారెడ్డి జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి భారీ ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా మైలార్ దేవుపల్లి, మొయినాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. దీంతో బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ. 60 లక్షల నగదు, పలు కంప్యూటర్స్, లాప్ టాప్ స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.