Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
బంజారాహిల్స్లోని డీఏవీ స్కూల్లో చిన్నారిపై లైంగిక దాడి వ్యవహారంలో డ్రైవర్ రజనీకుమార్ను నాంపల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టు దోషిగా తేల్చింది. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. డీఏవీ స్కూల్లో చదువుతున్న నాలుగేళ్ల బాలికపై గత ఏడాది అక్టోబర్ 17న లైంగిక దాడి జరిగింది. ప్రిన్సిపల్ కారు డ్రైవర్గా పనిచేస్తున్న రజనీకుమార్ పలుమార్లు దాడికి పాల్పడ్డాడు. అదే ఏడాది 19న పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బాలికపై లైంగిక దాడికి సంబంధించిన సాక్ష్యాలను బంజారాహిల్స్ పోలీసులు కోర్టుకు సమర్పించారు. విచారణ అనంతరం రజనీకుమార్ను న్యాయస్థానం దోషిగా ప్రకటించింది.