Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
చిత్తూరు జిల్లాలోని కొండమిట్టలో దారుణం చోటుచేసుకుంది. బ్యూటీపార్లలో పని చేస్తున్న యువతి ప్రశాంతిని దారుణంగా గొంతుకోసి చంపేశాడో యువకుడు. వేలూరు రోడ్డులోని ఆనందా ధియేటర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ క్రమంలో యువకుడు చక్రవర్తి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కొన ఊపిరితో ఉన్న యువకుడిని ఆస్పత్రికి తరలించారు పోలీసులు. మృతురాలు చిత్తూరు తాలూకా స్టేషన్ లోని కానిస్టేబుల్ నాగరాజు కుమార్తెగా గుర్తించారు. యువతి దుర్గా ప్రశాంతి(28)సంఘటనా స్ధలంలోనే మృతిచెందింది. కొన ఊపిరితో ఉన్న యువకుడు చక్రవర్తిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.