Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేపింది. పాఠశాలలో మొత్తం 8 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. పాఠశాలలో జ్వరంతో ఉన్న పలువురు విద్యార్థులను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి కరోనా పరీక్షలు చేయించగా, దానిలో ఒకరికి పాజిటివ్గా తేలింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది పాఠశాలలో మంగళవారం వైద్య శిబిరం నిర్వహించారు. జ్వరం, దగ్గుతో బాధపడుతున్న విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. పాఠశాలలో మొత్తం 172 మంది విద్యార్థులు, 39 మంది బోధన, బోధనేతర సిబ్బందికి ర్యాపిడ్ టెస్టులు చేశారు. వీరిలో 8 మంది విద్యార్థులకు పాజిటివ్ రాగా, వారి ఇండ్లకు పంపించినట్లు ప్రిన్సిపల్ జయశ్రీ తెలిపారు. మిగిలిన విద్యార్థులను ఓ గదిలో ప్రత్యేకంగా ఉంచామని, విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురికావద్దని సూచించారు. కరోనా కేసులు బయటపడిన నేపథ్యంలో పాఠశాలను డీఎంహెచ్వో హరీశ్రాజ్ సందర్శించారు. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేలా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్కు సూచించారు.