Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్ 149 పాయింట్ల నష్టంతో 59,577 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 42 పాయింట్లు నష్టపోయి 17,617 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ ఏడు పైసలు కుంగి 82.11 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, ఎంఅండ్ఎం, హెచ్డీఎఫ్సీ, పవర్గ్రిడ్, ఎల్అండ్టీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, హెచ్యూఎల్, సన్ఫార్మా, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్సీఎల్ టెక్, విప్రో, టెక్ మహీంద్రా, టీసీఎస్, నెస్లే ఇండియా, ఐటీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.