Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి సీబీఐ ముందు హాజరయ్యారు. జూబ్లీహిల్స్లోని తన నివాసం నుంచి బయల్దేరి కోఠిలోని సీబీఐ కార్యాలయానికి వెళ్లారు. సీబీఐ నోటీసుల నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. ఆయన్ను ఈనెల 25 వరకు అరెస్ట్ చేయవద్దని సీబీఐని ఆదేశించింది. అయితే అప్పటి వరకు సీబీఐ కార్యాలయంలో ప్రతి రోజూ విచారణకు హాజరుకావాలని షరతు విధించింది. అవినాష్కు ప్రశ్నలను రాతపూర్వకంగా ఇవ్వాలని.. విచారణను ఆడియో, వీడియో రికార్డు చేయాలని సీబీఐని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 25న తుది ఉత్తర్వులు జారీ చేస్తామంటూ విచారణను ఉన్నత న్యాయస్థానం వాయిదా వేసింది.